సత్య సాయి త్రాగునీటి సరఫరా కార్మికులకు వేతనాలు విడుదల

77చూసినవారు
సత్య సాయి త్రాగునీటి సరఫరా కార్మికులకు వేతనాలు విడుదల
అనంతపురం జిల్లాలో సత్యసాయి త్రాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలకు బుధవారం 30 కోట్ల నిధులు విడుదల చేస్తూ గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను కార్మికుల ఖాతాలో జమ చేయడానికి సమయం పట్టే అవకాశం ఉందని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ లేకపోవడంతో కార్మికులకు ఎలా జమ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత పోస్ట్