టిడిపి నాయకులు, కార్యకర్తలు కోసం తుది రక్తపు బొట్టు వరకు పోరాడుతానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసానిచ్చారు. గురువారం కొత్తచెరువు మండలంలోని తలమర్ల పంచాయతీ పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు.