వ్యవసాయ అధికారులంతా గ్రామాల బాట పట్టాలి: ఎమ్మెల్యే

55చూసినవారు
వ్యవసాయ అధికారులంతా గ్రామాల బాట పట్టాలి: ఎమ్మెల్యే
అనంతపురం క్యాంపు కార్యాలయంలో రెండు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఇతర ముఖ్య అధికారులతో ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం సమావేశమయ్యారు. వ్యవసాయ అధికారులంతా గ్రామాల బాట పట్టాలని ప్రతి రైతుకి పార్టీలకతీతంగా ఈక్రాప్ నమోదు చేయాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రతి రైతుకు అందాలని పేర్కొన్నారు. 80% సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలు రైతులకు అందేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్