రాప్తాడు: హైవేపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి

55చూసినవారు
రాప్తాడు: హైవేపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన ఓబులప్ప(75) ను సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై బెంగళూరు నుంచి అనంతపురం వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్