నిధులు లేకుండా స్కీం ఎలా నడుస్తుంది

58చూసినవారు
నిధులు లేకుండా సత్యసాయి నీటి పథకం ఎలా నడుస్తుందని సత్యసాయి కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర శుక్రవారం పేర్కొన్నారు. బుక్కరాయ సముద్రంలో కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతుంది. ఆయన మాట్లాడుతూ సత్యసాయి నీటి పథకాన్ని పరిరక్షించాలని, కార్మికుల వేతనాలు ఇవ్వాలని అందరికీ విన్నవించామన్నారు. అయితే ఎవరూ చొరవ చూపక పోవడంతో సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. మరమ్మతులకు కూడా నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్