శింగనమల: భారీ వర్షానికి నేల కూలిన చెట్లు

74చూసినవారు
శింగనమల మండలంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని రైతన్నలు సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని నాగలగుడ్డం గ్రామంలో ఆదివారం కురిసిన గాలివానకు కౌలు రైతు మక్బుల్ భాష ఆరు ఎకరాల్లో సాగుచేసిన మునగ చెట్లు నేల కొరిగాయి. దీంతో తనకు రూ. 3 లక్షల దాకా నష్టం వచ్చినట్లు కౌలు రైతు తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులు తన తోట సందర్శించి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్