తాడిపత్రి: మట్కా నిర్వాహకుడు అరెస్ట్

83చూసినవారు
తాడిపత్రి: మట్కా నిర్వాహకుడు అరెస్ట్
తాడిపత్రి పట్టణంలో మట్కా స్థావరంపై పోలీసులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని నందలపాడులో మట్కా నిర్వహిస్తున్న మిద్దె ఓబయ్య (40) అనే నిర్వాహకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ 25, 000/-నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్