పలాస-కాశీబుగ్గ సాయిబుల కాలనీలో ముగ్గురు యువకులు గదిని అద్దెకు తీసుకుని మేకపోతులను దొంగతనం చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో శనివారం సాయంకాలం లోద్దభద్రలో మేకపోతు ను దొంగలించి పట్టుకెళ్తుండగా అనుమానంతో గ్రామస్తులు ఆపి వివరాలు సేకరించారు. దీంతో వారు బైక్ పై పారిపోవడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి దొరికిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.