నారీ భేరి కార్యక్రమంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

66చూసినవారు
విజయవాడ హోటల్ మురళీ ఫార్చ్యూన్ లో ఎన్నారై మహిళా వింగ్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు వారి నారీ భేరి కార్యక్రమంలో శనివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నారై లు కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని, పల్లెలలో ఉన్న మహిళల యొక్క జీవన ప్రమాణాలు మార్చాలని కోరారు. ఉద్దనం మహిళలకు కష్టబడే మనస్తత్వం కలవాలని, పరిశ్రమలు ఏర్పరిస్తే ఆర్థికంగా వారు స్థిరపడతారని అన్నారు.

సంబంధిత పోస్ట్