వరద బాధితులకు బైపల్లి భారీ విరాళం

78చూసినవారు
వరద బాధితులకు బైపల్లి భారీ విరాళం
భారీ వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న తరుణంలో.. జై భారత్ నేషనల్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి బైపల్లి పరమేశ్వర రావు బుధవారం భారీ విరాళం అందజేశారు. ఏపీ ముఖ్య మంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 వేల రూపాయల విరాళంగా ఇచ్చారు. అతి త్వరగా ఈ విపత్తు నుండి ప్రజలు కోలుకోవాలని కోరారు. కాగా ఇటివల కేరళ వయనాడ్ బాధితులకు లక్ష రూపాయలు విరాళంగా ఆయన అందజేశారు.

సంబంధిత పోస్ట్