మాజీ విద్యా కమిటీ చైర్మన్ కు సన్మానం

51చూసినవారు
మాజీ విద్యా కమిటీ చైర్మన్ కు సన్మానం
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ విద్యా కమిటీ చైర్మన్ లకు మరియు శానిటేషన్ కార్మికులకు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో సన్మానించడం జరిగింది. సంతబొమ్మాలి మండలంలో నౌపడా పంచాయతీ యంపిపి స్కూలు మాజీ విద్యా కమిటీ చైర్మన్ నీలాపు. లింగరాజు ను పాఠశాల యాజమాన్యం సన్మానించగా, జగన్నాధపురం (యన్) పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోట. పరమేశ్వరరావు, అలాగే శానిటైజర్ కార్మికురాలు బొమ్మాళి. శాంతకుమారిను పాఠశాల యాజమాన్యం మరియు గ్రామ పెద్దలు సన్మానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్