రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

276చూసినవారు
రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
లావేరు మండలంలోని లక్ష్మీ పురం పంచాయతీ పరిధిలోని నేతేరు గ్రామంలో శుక్రవారం సమగ్ర భూ సర్వేను స్ధానిక సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ, ఎంపిటిసి సభ్యులు కాగితాల కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి డ్రోన్ ద్వారా సర్వేను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర రీసర్వేతో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. భూ తగాదాలు జీవితాలను నాశనం చేస్తాయని సిఎం గ్రహించి మీ భూమి మా హామీ కార్యక్రమం చేపట్టారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్