తేలుకుంచిలో అశోక్ ప్రచారం

50చూసినవారు
ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచిలో ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం అశోక్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన అంతానికి ఇదే సరైన సమయమని అన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి దాసరి రాజు, టిడిపి నాయకులు దక్కత ఢిల్లీరావు, మెరుగు సూర్యనారాయణరెడ్డి, దక్కత ఏకాంబరి, పద్మనాభం, రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్