టిడిపి ఎన్నికల ప్రచారం
కవిటి మండలంలోని పెద్ద కర్రివాని పాలెం పంచాయతీలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు డాన్సులు వేస్తూ అశోక్ ను ఊరేగించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, కూటమి అందించబోయే పథకాల గురించి అశోక్ వివరించారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుని గెలిపించాలని అభ్యర్థించారు.