ఘనంగా ఎస్పీ బాలు వర్ధంతి కార్యక్రమం

81చూసినవారు
కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో బుధవారం ఎస్పీ బాలసుబ్రమణ్యం 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏడు మండలాల కళాభారతి సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి, స్థానిక కళాకారులచే ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటల సినీ సంగీత విభావరి కార్యక్రమం, సహపంక్తి భోజనాలు చేసి, ఎస్పీ బాలు కోసం వ్యాఖ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 7 మండలాల కళాకారులకు సంఘం తరుపున సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్