మండపల్లిలో పిరియా విజయ పల్లె నిద్ర
ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి గ్రామంలో వైసిపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. కార్యక్రమానికి ముందు ఆమె రచ్చ బండపై స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవ ర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా నన్నారు. ఎంపీపీ బోర పుష్ప, సర్పంచ్ పిట్ట శశిరేఖ, ఎంపీటీసీ సభ్యురాలు పిట్ట హేమలత తదితరులు పాల్గొన్నారు.