శ్రీకాకుళం జిల్లా పాతపట్టణంలోని ప్రధాన రహదారుల్లో మంగళవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు పాతపట్నం మెయిన్ రోడ్డు, సాయినగర్, త్రీనాధ్ వెల్డింగ్ షాపు రోడ్డు లో కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక శక్తులు చెలరేగి పోకుండా ప్రజలకు భరోసా కల్పించడం కోసమే ఈ కవాతు నిర్వహించినట్లు పట్టణ సీఐ సాయి తెలిపారు.