వర్షం నీరు మళ్లింపు

79చూసినవారు
వర్షం నీరు మళ్లింపు
అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు హిరమండలంలోని జగన్నాధపురం ప్రాధమిక  పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. పాఠశాల మైదానం పూర్తిగా నీటితో నిండి పోయింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్, సభ్యులు, గ్రామస్తులు సహకారం జేసీబీతో పనులు చేపట్టారు. పాఠశాల మైదానంలో నిల్వ నీటిని, కాలువలను శుభ్రం చేసి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్