ఎన్నికలు నిర్వహించే అధికారులకు కనీస అవగాహన లేదు

65చూసినవారు
తాను పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వస్తే తన ఓటు నెల్లూరులో ఉందంటూ సిబ్బంది సమాధానం ఇవ్వడం పట్ల సిబ్బంది అవగాహన లేమికి నిదర్శనమని పెద్దపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు దలపాటి శ్రీనివాసరావు వాపోయారు. శ్రీకాకుళం మండలం పెద్దపాడు ప్రభుత్వ పాఠశాల వద్ద ఆదివారం మాట్లాడుతూ ఎన్నికల అధికారుల తీరు ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఉపాధ్యాయులకు కూడా ఈవీఎం ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్