టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రంలో ఉన్న పక్షి పిల్లల సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విడిది కేంద్రంలోని పక్షి పిల్లల సంరక్షణకు అవసరమయ్యే సంరక్షణ వలలు పూర్తిస్థాయిలో లేవు. పక్షి పిల్లలకు ఆహారం కూడా పూర్తిస్థాయి లో అందడంలేదని గ్రామస్తులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.