మూగజీవికి మరోజన్మ

579చూసినవారు
మూగజీవికి మరోజన్మ
సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురంలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ గేదెకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పశువైద్యాధికారి గురువెల్లి రాజ్ కుమార్ సోమవారం శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. చూలుతో ఉన్న గేదె కడుపులో ఉన్న దూడ అడ్డంతిరిగి ప్రసవం కాక మృతిచెందడంతో గేదె తీవ్ర అస్వస్థతకు
గురైంది. హెరిటేజ్ పాడిరైతు బాలక వసంతరావు సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు..

సంబంధిత పోస్ట్