ఉద్యోగాలు తొలగింపుతో మూలపేట పోర్టు నిర్వాసితుల ఆందోళన

85చూసినవారు
సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో పనిచేస్తున్న నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 17 మందిని ఉద్యోగాల నుండి తొలగించడంతో నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచ్ జీరు బాబురావు ఆధ్వర్యంలో గ్రామస్తులు పోర్టులోకి ప్రవేశించి ఉద్యోగాల తొలగింపు పై పోర్టు అధికారులను నిలదీశారు. సర్వం కోల్పోయిన మాపై రాజకీయ కక్ష సాధింపులు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్