ఏపీ మరో 5 ఏళ్లు నలిగిపోవాలని కేటీఆర్ చూశారు అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ గెలవాల్సిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గులాబీ పార్టీ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఫైర్ అయ్యారు.