పల్నాడులో వైసీపీ నాయకుల వినాయక నిమజ్జనాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు (వీడియో)

61చూసినవారు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిసిరిలో వైసీపీ కార్యకర్తల వినాయక నిమజ్జనానికి టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రామం నుంచి నిమజ్జనానికి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై ట్రాక్టర్‌ నిలిపారు. దాదాపు 3 గంటల పాటు హైడ్రామా నడిచింది. దాంతో వైసీపీ కార్యకర్తలు వినాయకుడి విగ్రహాన్ని వెనక్కి తీసుకెళ్లి మండపంలోనే పునఃప్రతిష్టించారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడే వినాయక నిమజ్జనం నిర్వహిస్తామని.. అప్పటివరకు పూజలు కొనసాగిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్