AP: ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో 6, 7వ తరగతి విద్యార్థినుల పట్ల రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఫిర్యాదు చేశారు. దాదాపు 6 మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఇంట్లో చెప్తే కొడతానని పిల్లలను బెదిరించాడని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.