AP: ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఇవాళ్టి రోజుల్లో సెల్ఫోన్ అందరికీ నిత్యవసర వస్తువుగా మారింది. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చాం. మొట్టమొదట దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. ఆలోచన విధానంలో మార్పు రావాలి అని' చంద్రబాబు పేర్కొన్నారు.