IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ గాయం నుండి కోలుకోవడంతో ఈ మ్యాచ్ కెప్టెన్గా ఆయనే వ్యవహరిస్తున్నారు.