ఏపీ ఎన్నికల వేళ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. మాచర్ల, అనంతపురం, తెనాలి ఘటనలపై మండిపడింది. బూత్ క్యాప్చరింగ్, ఈవీఎంల తరలింపునకు అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. గొడవలకు దిగిన వారిని గృహ నిర్భందం చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేయాలని సూచించింది.