AP: పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈనెల మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ లో మార్కులను ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22వ తేదీన పదోతరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.