సీఎం జగన్పై జరిగిన రాయి దాడి డ్రామాకు తాడేపల్లి ప్యాలెస్లో ముందే స్క్రిప్ట్ రాశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ డ్రామాలో హీరో జగన్, సైడ్ హీరో ఎమ్మెల్యే వెల్లంపల్లి అని ఎద్దేవా చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు దాడి చేయించుకుని టీడీపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.