రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను, పవన్ కళ్యాణ్ ఉభయగోదావరిలో పర్యటిస్తామని తెలిపారు. బీజేపీ జాతీయ నేతలు కూడా ప్రచారానికి వస్తారని వెల్లడించారు. కూటమి సీట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు అని స్పష్టం చేశారు. ఇది టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనునిత్యం జరుగుతోందన్నారు.