ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు రికార్డు సృష్టించారు. యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్( 86), రవీంద్ర జడేజా(87 )లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో
భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో 92 ఏళ్ల భారత టెస్ట్
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు బ్యాటర్లు 80+ రన్స్ చేసి ఔట్ అయిన రికార్డ్ నమోదైంది. ఈ ఇన్నింగ్స్లో
భారత్ 436 రన్స్ చేసింది.