సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించండి: ఏఐఎస్ఎఫ్

55చూసినవారు
తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని బకాయిలు ఉన్న మెస్, కాస్మొటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్