వెదరు కుప్పం మండలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

71చూసినవారు
వెదరు కుప్పం మండలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం చవటగుంటలో వెలసిన మీనాక్షీ దేవి సమేత శ్రీశ్రీశ్రీ ఆవు దేవర నందీశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజైన ఆదివారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్