
కావలి: ఆ ఇద్దరి భౌతికాయాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే
కావలి రూరల్ మండలం గౌరవరంకు చెందిన కూనం వాసుదేవరెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సోమవారం గౌరవరంలోని వారి నివాసానికి చేరుకొని వాసుదేవరెడ్డి భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే సిరిపురంకు చెందిన గంటా కోటేశ్వరరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సిరిపురంలోని వారి నివాసానికి వెళ్లి కోటేశ్వరరావు భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.