కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగాని పల్లి సమీపంలోని క్రిష్ణగిరి కుప్పం జాతీయ రహదారిపై శనివారం కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్థంభం విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.