నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పరిశీలించారు.