చారాలలో రోడ్లన్నీ బురదమయం, గ్రామస్తుల అసహనం

84చూసినవారు
చారాలలో రోడ్లన్నీ బురదమయం, గ్రామస్తుల అసహనం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామం నందు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ బురదమయమయ్యాయి. దీనితో వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా దోమల బారిన పడి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

సంబంధిత పోస్ట్