పంట పొలాలపై కొనసాగుతున్న ఏనుగుల దాడులు

55చూసినవారు
పంట పొలాలపై కొనసాగుతున్న ఏనుగుల దాడులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం పాతపేట పంచాయితీ, సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ రాంపల్లి బిట్ సమీపంలో ఏనుగులు పంట పొలాలపై దాడులు చేసి తమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని బాధితులు శనివారం తెలియజేశారు. ఏనుగుల దాడులలో టమోటా, వరి, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల దారి మళ్లించి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్