పుంగనూరులో ఇటీవల చనిపోయిన చిన్నారి అస్ఫియా అంజుమ్ ఇంటికి హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం వెళ్లారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండ్లో చిన్నారి కుటుంబీకులను ఆమె పరామర్శించారు. బాలిక మిస్ అయినప్పటి నుంచి మృతి వరకు జరిగిన పలు సంఘటనలను తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఆమె వెంట మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఫరూఖ్ ఉన్నారు.