లోక్ అదాలత్ లో ప్రజలకు సత్వర న్యాయం'

71చూసినవారు
లోక్ అదాలత్ లో ప్రజలకు సత్వర న్యాయం'
ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ తోడ్పడుతుందని ఇన్ఛార్జ్ న్యాయమూర్తి శిరీష్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు పట్టణంలోని న్యాయస్థానాల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారులను విచారించి వారి ఇరువురి సమ్మతం మేరకు న్యాయమూర్తులు రాజీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్