పుంగనూరులో చిన్నారి మృతి బాధాకరం

57చూసినవారు
పుంగునూరు పట్టణంలో చిన్నారి అస్ఫియా అంజుమ్ మృతి బాధాకరమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు పట్టణంలో ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా అదృశ్యమై 3 రోజులు గడిచిన ఒక్క సీసీ పుటేజ్ కూడా పోలీసులు సేకరించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషులను త్వరితగతిన గుర్తించకపోతే పోలీసుల అసమర్ధతపై తప్పకుండా స్పందిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్