రాష్ట్ర డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ కు ముత్తుకూరు గ్రామపంచాయతీ సర్పంచ్ బూదురు లక్ష్మి శాసనసభ సమావేశాలలో కలసి వినతి పత్రం ఇచ్చారు. బుధవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో ఆయనను కలవడం జరిగింది. గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయినాయని అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి పంచాయతీరాజ్ శాఖ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.