మంగళవారం మధ్యాహ్నం సూళ్లూరుపేటలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం కోసం వచ్చిన జిల్లా కలెక్టర్ కు సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య స్వాగతం పలికారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద బొకే ఇచ్చి స్వాగతించారు. ఎమ్మెల్యే వెంట మాజీ డిసిఎంఎస్ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి, ఓజిలి మధు రెడ్డి తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.