ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు (ఏప్రిల్ 22) ఏపీలోని తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలోని నారాయణ షాపింగ్ మాల్ సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొని పవన్ ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఉంగుటూరు నియోజికవర్గం గణపవరంలోని పోలీస్ దిమ్మ సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొని పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.