కొలువుల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది: భట్టి

74చూసినవారు
కొలువుల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది: భట్టి
కొలువుల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYD-ఎల్బీ నగర్ స్టేడియంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 'గత పదేళ్లలో BRS ఎన్నడూ ఉద్యోగాల గురించి ఆలోచన చేయలేదు. ఆరోజు డీఎస్సీని ప్రకటిస్తే, ధర్నాలు చేసి ఆపించాలని కుటిల ప్రయత్నాలు చేశారు. వాళ్ళ కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టి ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేశాం. టీచర్లకు నియామక పత్రాలు ఇస్తుంటే, ఇంతకంటే ఆనందం మాకు మరొకటి లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్