వల్లభనేని వంశీ అమెరికాలోని డల్లాస్ కు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 17వ తేదీన వల్లభనేని వంశీ యూఎస్ వెళ్లారు. వల్లభనేని వంశీ కొడుకు అక్కడే చదువుకుంటున్న క్రమంలో వంశీ యూఎస్ వెళ్లారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక వంశీ డల్లాస్ కి వెళ్లడాన్ని కూడా టీడీపీ నాయకులు ఎవరికి తోచినట్టు వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న ఆలోచనలో ఉన్న వంశీ అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు రెడీ అయ్యి యుఎస్ వెళ్లారని ప్రచారం చేస్తున్నారు.