ఎస్బీఐ సేవా కేంద్రంలో క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో దర్యాప్తు

75చూసినవారు
రామభద్రపురం మండల కేంద్రంలో గత 5 ఏళ్ళగా నడపబడుచున్న ఎస్బీఐ సేవా కేంద్రంలో శనివారం చోరీ జరిగింది. నిర్వాహకులు పివి సత్యారావు ఆదివారం గమనించి చోరీ పై స్థానిక ఎస్ఐ జ్ఞానప్రసాద్ కు సమాచారం అందించారు. ఎస్ఐ సిబ్బంది తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వారు వచ్చి, చోరీ తీరును పరిశీలించి ఆదారాలు సేకరించారు. సుమారు లక్షా 66 వేల నగదు, లాప్ టాప్ చోరీ జరిగినట్లు గుర్తించారు. ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్