విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన తప్పనిసరి: సీఐ

62చూసినవారు
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన తప్పనిసరి: సీఐ
విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. రామభద్రపురం ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో పోలీసు చట్టాలు, నిబంధనలు, ఉల్లంఘనలకు విదించే శిక్షలపై అవగాహన కల్పించారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ నేరమని దీనికి విడించబడే శిక్షలు వివరించారు. ఇటీవల సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని వీటి నివారణకు తల్లిదండ్రులకు విద్యార్థులే అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్