విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

77చూసినవారు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగంలో వేగంగా వస్తున్న కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందున వారు విజయనగరంకు చెందిన నమ్మి మనోజ్, తగరపువలసకు చెందిన అలమండ శ్యాంప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్